PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా పనిచేయండి.. ఎంపీడీవో

1 min read

పల్లెవెలుగు వెబ్​ గడివేముల: పౌర సేవల విషయంలో గ్రామ సచివాలయ సిబ్బంది అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా పారదర్శకంగా పనిచేయాలని గురువారం నాడు ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప గ్రామ సచివాల సిబ్బందికి సూచించారు పెసర వాయి గ్రామ సచివాలయం సందర్శించి సిబ్బందితో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా హౌసింగ్ వివిధ పథకాల గురించి సమీక్ష నిర్వహించారు అనంతరం ఎంపీయూపీ పాఠశాలలో సందర్శించి మధ్యాహ్న భోజన పథకం తనిఖీ చేశారు నిర్వాహకులు నాణ్యమైన మెనూతో విద్యార్థులకు ఆహారం అందించాలని ఈ సందర్భంగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి అబ్దుల్ ఖాలిక్ పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author