PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేయండి: టీజీ భరత్​

1 min read

పల్లెవెలుగు: టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​. బుధవారం తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర మహిళా విభాగం కార్యదర్శిగా  నగరంలోని రోజా వీధికి చెందిన కె. సౌభాగ్య లక్ష్మిని నియమించారు. ఈ సందర్భంగా మౌర్య ఇన్ లోని ఆయన కార్యాలయంలో ఆమెకు నియామక పత్రం అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీతారాం నగర్ కు చెందిన బి. తులసిరావును నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రం అందజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని ఈ సందర్భంగా టీజీ భరత్ సూచించారు. క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. అనంతరం కర్నూలు నియోజకవర్గ పరిధిలో పార్టీ కోసం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పనిచేస్తున్న టిడిపి సభ్యులకు పార్టీ సోషల్ మీడియా విభాగమైన ఐ టీడీపీ నియోజకవర్గ కమిటీలో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా వారందరికీ టీజీ భరత్ మౌర్య ఇన్ లో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిపి పార్లమెంటు అధ్యక్షులు తిలక్ గట్టు, కర్నూలు నియోజకవర్గ అధ్యక్షులు అఖిల్, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీపీ సభ్యులు మాట్లాడుతూ కర్నూల్ లో టీజీ భరత్ ఎమ్మెల్యే అయ్యేందుకు సోషల్ మీడియా పరంగా చురుగ్గా పనిచేస్తామన్నారు. టిజి భరత్ గెలిస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

About Author