PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ పార్టీ అధినేత ఇంటి పై చెప్పులు విసిరిన కార్మికులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఎమ్‌ఎస్‌అర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ సంస్థకు చెందిన కార్మికులు ముంబైలోని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఇంటిని చుట్టుముట్టారు. దక్షిణ ముంబైలోని పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’ వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల్లో కొందరు రోడ్డుపై బైఠాయించగా మరికొందరు ఆగ్రహం పట్టలేక శరద్‌ పవర్‌ ఇంటిపై రాళ్లు, చెప్పులు, బూట్లు విసిరారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో శరద్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

                                          

About Author