PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారానికి ఐదు రోజులే ప‌నిదినాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 27 నుంచి మరో ఏడాది పాటు వారానికి ఐదు పని దినాలు విధానం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

                                                   

About Author