PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ రక్తదాతల దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఒకరు రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదాతలు అవుతారని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని నేషనల్​ ఉమెన్స్​ పార్టీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆమె ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రలలోని బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్​. హసీనాబేగం మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి , అత్యవసరమైన వారి ప్రాణాలను కాపాడిన వారవుతారన్నారు. అంతేకాక రక్తహీనతతో బాధపడే వారు ఎందరో ఉన్నారని, వారందరికీ సహాయం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కర్నూల్ ఉమెన్స్ పార్టీ వింగ్ ప్రెసిడెంట్ మేరీ, పిఆర్ఓ సురేఖ, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author