NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ‌ర‌ల్డ్ బాక్సింగ్ పోటీ.. తెలంగాణ యువ‌తి సంచ‌ల‌నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియన్ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ సంచలనం సృష్టించింది. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 52 కేజీల కేటగిరిలో బ్రెజిల్‌కు చెందిన కరోలిన్ డే అల్మెడాను 5-0 తేడాతో ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై అన్ని బౌట్లలోనూ ఆధిపత్యం చెలాయించింది. 2022లో ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా జరీన్ నిలిచింది. కాగా ఇదివరకు మేరీ కోమ్, సరితా దేవీ, జెన్నీ ఆర్‌ఎల్, లేఖా సీ వంటి భారతీయ మహిళా బాక్సర్ల ప్రపంచ స్థాయి టైటిల్స్ గెలిచారు. ఇప్పుడు వీరి సరసన చోటుదక్కించుకునేందుకు నిఖత్ జరీన్‌కు అవకాశం ఏర్పడింది. రేపు గురువారం ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.

                                        

About Author