PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌ర‌ల్డ్ బాక్సింగ్ .. నిఖ‌త్ జ‌రీన్ విజ‌య‌కేత‌నం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిఖత్ జరీన్ సంచలనం సృష్టించింది. భారత్ తరపున బరిలోకి దిగిన జరీనా.. ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ 52 కేజీల విభాగంలో స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్లో ప్రత్యర్థి బాక్సర్, థాయ్‌లాండ్‌కు చెందిన 24 ఏళ్ల జే. జిట్పోంగ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఏకపక్ష విజయంతో చరిత్ర లిఖించింది. మొదటి రౌండ్‌లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకుంది. రెండో రౌండ్‌లో ఇద్దరికీ సమానమైన పాయింట్లు లభించాయి. చివరి రౌండ్‌లో చెలరేగి ఆడింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. జరీన్ దూకుడు ముందు ప్రత్యర్థి బాక్సర్ నిలవలేకపోయింది. ఈ విజయంతో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 6వ స్వర్ణాన్ని అందించింది.

                                    

About Author