NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీజీహెచ్​లో  ఒల్డ్ లెక్చర్ హాల్ లో ప్రపంచ కిడ్నీ డే

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు,  మాట్లాడుతూ..

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (డబ్ల్యుకేడి) ప్రపంచ కిడ్నీ డే సంద‌ర్భంగా కిడ్నీల ఆరోగ్యంపై ప్రజ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు జి జి హెచ్ మరియు కేఎంసి, నెఫ్రాల‌జీ విభాగం ఆధ్వర్యంలో సీఎంఈ ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలిపారు.కిడ్నీ సంబంధిత వ్యాధులను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అధిక సోడియం కలిగిన ఆహారాలు, కార్బోనేటేడ్ పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసం మొదలైనవి మూత్రపిండాల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి మంచి ఆరోగ్యనికై  ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి మంచి ఆహారము మరియు వ్యాయామం చేయడం వల్ల  ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.కేఎంఎస్​   ప్రిన్సిపల్, డా.చిట్టి నరసమ్మ,  మాట్లాడుతూ.. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) గురించి అవగాహన పెంచడానికి, ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న ఈ స‌మ‌స్యను ఎదుర్కోవ‌డంలో ప్రజ‌లంద‌రి భాగ‌స్వామ్యన్ని పెంచ‌డానికి ఇదో మంచి ముంద‌డుగ‌ని అన్నారు. కిడ్నీ అనేది మన అవయవాలలో ముఖ్య భాగమని శరీరంలో ఎటువంటి చెడు పదార్థాలైన బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.కిడ్నీ సంబంధించిన డైట్ ప్రతి ఒక్కరు అనుసరించాలని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.ఎ.శశికిరణ్  ఎం.డీ. డీఎం. సీనియర్ నెఫ్రాలజిస్ట్ & ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్, హైదరాబాద్ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా. శ్రీరాములు, డా.సీతారామయ్య, నెఫ్రాలజీ విభాగపు వైద్యులు, డా.జిక్కి, డా.ఆనంత్, డా.వెంకటపక్కి రెడ్డి, డా.శ్రీధర్ శర్మ, మరియు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *