PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జీజీహెచ్​లో ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం

1 min read

– ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకట రంగా రెడ్డి,  మాట్లాడుతూ:—

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో సెప్టెంబర్ 25, ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవంను  పురస్కరించుకొని  ఈరోజు ఫార్మసిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు.రిటైర్డ్ అయిన ఫార్మసిస్టులను ఫార్మసిస్ట్ సూపెర్వైసోర్  కే వి  సుబ్రహ్మణ్యం మరియు ఫార్మసిస్ట్ హుస్సేన్ సాహెబ్ లను ఘనంగా సన్మానించి ఆసుపత్రి ఫార్మసిస్టులతో కలిసి వారికి శాలువా మరియు పూలమాలతో  సన్మానించి వారికి ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రిలోని ప్రతి  పేషెంట్లకు సంబంధించి ప్రతి మెడిసిన్స్ ఇచ్చే విషయంలో  వారిదే కీలకమైన పాత్ర అని ఫార్మసిస్టులను కొనియాడారు.ఫార్మసిస్టులు మరింతగా కృషిచేసి ఆసుపత్రిని మరియు పేషెంట్స్ కు మెరుగైన వైద్య సేవలందించాలని ఫార్మసిస్టులను సూచించారు.ఈ కార్యక్రమానికి స్టోర్ మెడికల్  ఆఫీసర్, డా.శారద, డా.సునీల్ ప్రశాంత్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగంజన్, ఫార్మసిస్టులు శ్రీ.శర్మ, శ్రీ.నరసింహ రావు, మరియు ఫార్మసిస్టులు, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకట రంగా రెడ్డి,  తెలిపారు.

About Author