PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ జనాభా దినోత్సవం.. కలెక్టర్​ పోస్టర్ల ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రపంచ జనాభా దినోత్సవం” సందర్భముగా కలెక్టర్ మరియు జిల్లా  మేజిస్ట్రేట్ శ్రీ రంజిత్ బాష  వారి చాంబర్ నందు  పోస్టర్లను ఆవిస్కరించడం జరిగినది. ఈ కార్యక్రమములో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 11 వ తేదీన “ప్రపంచ జనాభా దినోత్సవం”  జరుపుకొంటున్నామని అందులోభాగంగా ఈ సంవత్సరం “ తల్లీ మరియు బిడ్డ శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్బదారణ మరియు బిడ్డకు బిడ్డకు మద్య అంతరం” అను నినాదంతో అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా నిర్వహించాలని ఆదేశించారు.    అనంతరం కుటుంబనియంత్రణ పద్దతులు పాటించిన లబ్దిదారులను బహుమతుల కొరకు లక్కీడీప్ ద్వారా ఎంపిక చేయడం జరిగినది . ఇందులో PPIUCD విభాగంలో రంగమ్మ, అంతర ఇంజెక్సన్ విభాగంలో జానకి ప్రియ , వ్యాసెక్టమి విభాగంలో మురళీధర్ రెడ్డి లను ఎంపీక చేయడం జరిగినది.  ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి  డాక్టర్ వై‌ ప్రవీణ్ కుమార్ , FDP నోడల్ ఆఫీసర్ డాక్టర్ బాలమురళి  , SO హేమసుందరం,  DEMO  శ్రీనివాసులు,  డిప్యూటీ డెమో చంద్రసేఖర్ రెడ్డి , ASO సునిల్ , మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత ,  ప్రాజెక్సనిస్ట్ ఖలీల్ , తదితరులు పాల్గొన్నారు. 

About Author