NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల10 నుండి ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు

1 min read

– శ్రీశ్రీ కళావేదిక సేవలు ప్రశంసనీయం
– రాష్ట్ర సాహిత్య మండలి చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి.
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పెద్ద తిరుపతి లో 10వ తేదీలలో జరుగు ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల పోస్టర్లు మన ఏలూరు జిల్లా శ్రీశ్రీ కళావేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య మండలి చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరింప బడినవి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా.కత్తిమండ ప్రతాప్ సేవలను ప్రశంసించారు. సాహిత్య రంగంలో శ్రీశ్రీ కళావేదికకు ప్రభుత్వపరంగా సహాయ సహకారములు అందించుటకు తగు కృషి సల్పుతానని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన ఏలూరు జిల్లా కమిటీకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమానికి హాజరైన కమిటీ సభ్యులు అధ్యక్షులు హరికోటి, ఉపాధ్యక్షులు శొంఠియాల కస్తూరిరావు,ప్రధాన కార్యదర్శి మానుకొండ చిన్నయ్య,ఆర్గనైజింగ్ కార్యదర్శి గురుశర్మ,కార్యదర్శి ఎం జె సుజయ్ కృష్ణ, మహిళా కార్యదర్శి శ్యామల హరికోటి తదితరులు పాల్గొన్నారు.

About Author