PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా కార్తీక సోమవారం పూజలు

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: మండలంలోని ఆయా గ్రామాలలో కార్తిక సోమవారం పూజలు భక్తులు ఘనంగా నిర్వహించారు. కార్తిక మాస పౌర్ణమిని పురస్కరించుకొని రుద్రవరంలోని శ్రీ భాస్కర నందీశ్వర స్వామి వెలగలపల్లె పొలిమేరలో వెలిసిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి శ్రీ మానస లింగేశ్వర స్వామికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో రెండవ సోమవారం కావడంతో శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాటుచేసిన హోమం కార్యక్రమాలను వారణాసి గోపి శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల పర్యవేక్షణలో 108 జంటలతో ఘనంగా నిర్వహించారు. ఆలయానికి పోటెత్తుతున్న భక్తులతో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బిజెపి నాయకుడు భూమా కిషోర్ రెడ్డి శ్రీ మానస లింగేశ్వర స్వామి శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని హోమం కార్యక్రమాలలో పాల్గొన్నారు.

About Author