NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాకూబ్ సాహెబ్ మసీదు నూతన కమిటీ ఎంపిక

1 min read

పల్లెవెలుగు, కడప బ్యూరో : కడప పట్టణం కృష్ణ సర్కిల్ సమీపంలో గల యాకుబ్ సాహెబ్ మసీదుకు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని కీ.శే. యాకుబ్ సాహెబ్ వారసులు, వారి కుటుంబ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాకూబ్ సాహెబ్ మసీదు డెవలప్మెంట్ కమిటీ గా నూతన కమిటీ కి పేరు పెట్టడం జరిగిందని, ఈ కమిటీ 2021 ఏప్రిల్ 10న రిజిస్టర్ అయ్యిందన్నారు. కమిటీ అధ్యక్షుడిగా పి.ఎం.డి అక్రమ్, జనరల్ సెక్రటరీగా పి.ఎం.డి ఇక్బాల్ ను నియమించడం జరిగిందన్నారు. 1989లో యాకుబ్​ సాహెబ్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ కమిటీ పేరుతో 2019 వరకు కొనసాగిందని, నిర్ణీత సమయం ముగియడంతో కొత్త కమిటీని ఎన్నుకున్నట్లు యాకుబ్​ సాహెబ్​ వారసులు స్పష్టం చేశారు.

About Author