PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి అభ్యర్థి  డాక్టర్ సుధీర్ ధార వివాహస్పద వ్యాఖ్యలు..

1 min read

భగ్గుమంటున్న ఎమ్మార్పీఎస్ నాయకులు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు   వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ధారా మాలల నియోజకవర్గం నందికొట్కూరు అంటూ చేసిన వివాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ 12న మంగళవారం  ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ లింగాల స్వాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సోమవారం ఆయన మాట్లాడుతూ  మాలల ఆత్మీయ సదస్సు కు మేము వ్యతిరేకం కాదు.  ఆ సదస్సులో వైసిపి నియోజకవర్గ సమన్వయకర్తగా  ఎమ్మెల్యే అభ్యర్థి  డాక్టర్ సుధీర్ ధారా  సొంతం కులం మెప్పుదల కోసం అన్ని వర్గాల మతాల సమ్మిళితమైన నందికొట్కూరు నియోజవర్గమును మాల నియోజకవర్గ అంటూ చెప్పడం సరికాదని, దీనికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  వైసీపీ పార్టీ కేవలం మాల సామాజిక వర్గానికి అంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ పార్టీ సమన్వయకర్త గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  మాదిగ,  మాదిగ ఉపకులాల  ప్రజలు ఎంతగానో అభిమానించే యువ నాయకుడు సిద్ధార్థ రెడ్డి సమక్షంలోనే ఈ వాక్యాలు చేయడం బాధాకరమని  తక్షణమే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

About Author