NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ చింతలపూడి అభ్యర్థి కంభం విజయరాజు కాంతం పాలెంలో పర్యటన..

1 min read

ఓటర్లను కలుసుకొని ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని అభ్యర్థన

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : చింతలపూడి మండలం కాంతం పాలెం  గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు ఎండను కూడా లెక్కచేయకుండా విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో ఉన్న పెద్దలను గ్రామస్తులను విజయ రాజు  ఆప్యాయంగా పలకరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే వైసీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామంలో అందరితో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ గ్రామ సమస్యలను విజయ రాజు పరిశీలించారు. ఈ ర్యాలీలో చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ జానకి రెడ్డి, జెడ్పిటిసి నీరజ, ఎంపీపీ డాక్టర్ రాంబాబు తదితర మండలాల నాయకులు పాల్గొని  అఖండ మెజారిటీతో విజయం సాధించాలని ఆయా గ్రామాల వైసీపీ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించారు.

About Author