NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేటి నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా పేట లో  శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  ఆధ్వర్యంలో 2024 ఎన్నికల ప్రచారం ప్రారంభం లో భాగంగాగడప గడపకు ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు. ముందుగా సాయిబాబా పేట నందు  శుక్రవారం  ఉదయం 6:30 గంటలకు  సాయిబాబా దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందన్నారు. ఈ ప్రచారం లో  వైస్ చైర్మన్ లు, పట్టణ అధ్యక్షులు, మార్కెట్ యార్డు చైర్మన్, జె.సి.యస్ కన్వీనర్, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, వైసిపి ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్ లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

About Author