PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అజ్ఞాతంలోకి వైసీపీ బ‌హిష్కృత నేత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టుల వెనుక వైసీపీ బ‌హిష్కృత నేత మహానంది రెడ్డి ప్రమేయం ఉందంటూ పోలీసులకు పిర్యాదులందాయి. దీంతో ఆయన ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మహానంది రెడ్డి.. ఆయన అనుచరులు కూడా అందుబాటులో లేరు. గత కొన్ని రోజులుగా ప్రకాష్ రెడ్డి, మహానంది రెడ్డి ఎడ మొహం, పెడ మొహంగా ఉంటున్నారు. రాప్తాడు వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్‌కు వైసీపీ అధిష్టానం చెక్ పెడుతూ కీలక నేతగా ఉన్న మహానంది రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మ‌హానందిరెడ్డి గన్ మెన్ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వైసీపీ శ్రేణుల్లో జోరుగా చర్చసాగుతోంది.

                              

About Author