PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పై వైసీపీ ఫైర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రి జోగి రమేష్‌. సుజనా చౌదరి టీడీపీ ఆఫీసు నుంచి తెచ్చిన స్క్రిప్టుని బీజేపి నేత అనురాగ్ ఠాగూర్ చదివారని.. అసలు అనురాగ్‌కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ మూడేళ్లలో రెండు లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 90 వేలమందికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించామన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ ఇచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోతుందా? అని ధ్వజమెత్తారు. మతతత్వ రాజకీయాలతో రాష్ట్రంలో ఎదగాలని ఆశ పడుతున్నారని ఆరోపించారు.

                                     

About Author