PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ జెండా ఆవిష్కరణ పల్లెకు పోదాం కార్యక్రమం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలో స్థానిక నాయకుడు సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. జడ్పిటిసి  చంద్రశేఖర్ రెడ్డి. మండల వైసిపి అధ్యక్షుడు ఎల్లంపల్లి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నాడు వైసిపి జెండాను ఆవిష్కరించారు అనంతరం పల్లెకు పోదాం కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అందజేసిన పథకాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మండల వైసీపీ అధ్యక్షుడు ఎల్లంపల్లి శివరాం రెడ్డి మాట్లాడుతూ వైసిపి అమలు చేసిన సంక్షేమ పథకాలు  రానున్న ఎన్నికల్లో  మళ్లీ తామే అధికారంలో వస్తామని  జగనన్న రెండోసారి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని దళారులు ప్రభుత్వ పథకాలు అందకుండా మధ్యలోనే జేబులు నింపుకున్నారని ఆరోపించారు పారదర్శక పాలనకు వైసిపి ప్రభుత్వం దేశంలోనే పేరుగాంచిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

About Author