PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి ప్రభుత్వంతోనే గ్రామ అభివృద్ధి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి పదముతోనే ముందడుగు వేస్తున్నాయని  జడ్పిటిసి బోరెడ్డి రామిరెడ్డి, మండల వ్యవసాయ సలహా చైర్మన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి,జెసిఎస్ మండల కన్వీనర్ బోర మల్లికార్జున రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ పోతుదొడ్డి కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని వెంగళంపల్లి గ్రామంలో సర్పంచ్ కొండాపురం రంగస్వామి ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ సెంటర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల వద్దకే పాలన అంటూ రైతు భరోసా కేంద్రాలు ,హెల్త్ క్లీనిక్ సెంటర్లు ప్రభుత్వ కార్యాలయం నిర్మించి ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం సేవలను అందిస్తున్నారు. ప్రజలు గమనించి మరోసారి వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని వారు కోరారు .ఈకార్యక్రమంలో  ఏన్. రంగాపురం సర్పంచి సుబ్బారెడ్డి ,ఎంపీటీసీ రామనాయుడు, వైసిపి నాయకులు సుధాకర్ గౌడ్, మద్దయ్య,  వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author