PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

23 వేల ఆధిక్యంలో వైసీపీ !

1 min read

పల్లెవెలుగు వెబ్​: క‌డ‌ప‌ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 259 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. బద్వేల్‌లో మూడో రౌండ్‌లో 23వేల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది.

About Author