PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కంచు కోటకు బీటలు…

1 min read

టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు.

చెలిమిల్ల గ్రామ వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ కంచుకోట కు బీటలు వారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడంతో ప్రతి నిత్యం నియోజకవర్గ, పార్లమెంట్ పరిధిలో టీడీపీ లోకి చేరికలు కొనసాగుతున్నాయి.టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.  పాములపాడు మండంలం చెలిమిల్ల గ్రామంలోని వైసిపి కార్యకర్తలు శనివారం  దాదాపుగా 40 కుటుంబాలు  టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు  కృష్ణా రెడ్డి మాట్లాడుతూ మేమంతా టీడీపీ ఎంపీ అభ్యర్థి  డాక్టర్ బైరెడ్డి శబరి ని అత్యధిక మెజారిటీ తో గెలుపించుకుంటామని అన్నారు. పెద్ద రాజశేఖర్, మధు కుమార్ ,అబ్రహాము, కిషోర్, ప్రశాంత్, కల్లుబండి రవికుమార్, వేముల గోపి, రాజ్, స్వాములు, తదితరులకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

About Author