PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్​ ?

1 min read
  •  సెర్ఫ్ సీఈఓ, సీసీఎల్​ఏ సెక్రటరి, మైనార్టీ వెల్ఫేర్​ సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఐఏఎస్​ అధికారి
  • అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్​ అధికారి
  • కర్నూలు టిక్కెట్​పై ఉత్కంఠకు తెరదించేనా…?
  • ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి ఇంతియాజ్​కు సహకరించేనా..?

కర్నూలు, పల్లెవెలుగు: రాయలసీమలో  వైసీపీ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్​కు ఉన్న డిమాండ్​ మరెక్కడా ఉండదేమో. ఐదేళ్లుగా వర్గవిభేదాలతో మాటల తూటాలు పేల్చుకుంటూ… ,  నాకంటే… లేదు నాకే టిక్కెట్​ అని చెప్పుకునే ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డికి వైసీపీ అధిష్ఠానం భారీ షాక్​ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  వైసీపీ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్​ను ఇంతియాజ్​ అహ్మద్​ ఐఏఎస్​ అధికారికి ఖరారు అయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. అధిష్ఠానం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.  ఇంతియాస్​ అహ్మద్​  ప్రభుత్వ సెర్ఫ్ సీఈఓ, సీసీఎల్​ఏ సెక్రటరి, మైనార్టీ వెల్ఫేర్​ సీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ టిక్కెట్​ తనకు ఖరారు కానుందని, అందుకే తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఆయన తన పదవికి రాజీనామా చేసి, వీఆర్​ఎస్​లోకి వెళ్లిపోయారు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు తెలిసింది. వైసీపీ అధిష్ఠానం అధికారికంగా వెలువడించే ప్రకటన కోసం ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

అయోమయం..ఆందోళన…

గత  ఐదు నెలలుగా కర్నూలు అసెంబ్లీ టిక్కెట్​ తనదంటే…తనదంటూ… ఒకరికొకరు సవాల్​ … పంచ్​ డైలాగులు విసురుకున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగిలేటట్లు ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​కు టిక్కెట్​ లేదని, ఇలియాస్​ బాషకు ఇస్తున్నామని ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.  దీంతో ఎమ్మెల్యే అనుచరులు కర్నూలు రీజనల్​ కో ఆర్డినేటర్​ రామసుబ్బారెడ్డి ఎదుట పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఇది జరిగి ఐదు రోజులు కాక ముందే ఇంతియాజ్​ అహ్మద్​ ఐఏఎస్​ అధికారికి కర్నూలు అసెంబ్లీ టిక్కెట్​ ఇస్తున్నారని రూమర్లు రావడంతో …అటు ఎస్వీ వర్గం… ఇటు హఫీజ్​ఖాన్​ వర్గం అయోమయంలో పడింది.

సహకరిస్తారా…?

వైసీపీ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్​ ఇంతియాజ్​ అహ్మద్​ ఐఏఎస్​ అధికారికి ఖరారు అయితే… ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి సహకరిస్తారా… లేదా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. అటు పార్టీ క్యాడర్​లోనూ గందరగోళం నెలకొనే పరిస్థితి. వైసీపీ పెద్దలు లోకల్​ లీడర్లను సంప్రదించి… టిక్కెట్​ ఖరారు చేశారా.. లేదా… అనే అనుమానం లేకపోలేదు.

About Author