PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగురాలి పై వైసీపీ లీడ‌ర్ అత్యాచారం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గూడెం కొత్తవీధి మండ‌లం సీలేరులో ఓ దివ్యాంగురాలిపై వైకాపా నాయ‌కుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల క‌థ‌నం మేర‌కు .. సీలేరుకు చెందిన దివ్యాంగురాలికి వివాహ‌మైంది. భ‌ర్త ఆమెను వ‌దిలేశాడు. త‌ల్లి వ‌ద్దే ఉంటూ స్థానికంగా వ్యాపారం చేసుకుంటోంది. వారం క్రితం బాధితురాలి త‌మ్ముడు అనారోగ్యం బారిన‌ప‌డ‌గా .. ఆమె త‌ల్లి విజ‌య‌న‌గ‌రం తీసుకెళ్లింది. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న బాధితురాలు అర్థరాత్రి ఆరుబ‌య‌ట ఉన్న మ‌రుగుదొడ్డికి వెళ్లింది. అక్కడే కాపుకాసిన వైకాపా గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు నాళ్ల వెంక‌ట‌రావు ఆమెపై దాడి చేసి చున్నీతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విష‌యం బ‌య‌ట‌కు చెప్పొద్దని హెచ్చరించి, అక్కడి నుంచి ప‌రారీ అయ్యాడు. ఇంటికి వ‌చ్చిన త‌ల్లికి బాధితురాలు విష‌యం చెప్పడంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను కేజీహెచ్ కు త‌ర‌లించారు. నిందితుడిపై ఐపీసీ 376, దివ్యాంగుల సెక్షన్ కింద కేసు న‌మోదు చేశారు. వెంక‌ట‌రావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

About Author