PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రచారంలో దూకుడు.. పెంచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :   ఎమ్మిగనూరు పట్టణంలో 33 వ వార్డ్ లక్ష్మి పేట పాత కళ్ళు పెంట  నుండి ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక వార్డు ఇన్చార్జి వడ్డే వీరేష్, పార్టీ శ్రేణులతో కలిసి  ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న చేసిన సంక్షేమాలను వివరిస్తూ మళ్లీ అధికారంలోకి వచ్చేది వైకాపా నే…జగనే ముఖ్యమంత్రి అని ఈ 58 నెలల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు అని,ఎమ్మిగనూరు లో త్రాగునీటికి సమస్య లేకుండా శాశ్విత పరిష్కారం చేస్తానని, చేనేతలను అన్ని విధాలుగా ఆదుకుంటానని, టెక్సటైల్స్ పార్క ను నిర్వహిస్తానని తెలిపారు. ఈ ప్రచారం లో బుట్టా శివ నీలకంఠ ,వార్డ్ ఇన్చార్జి వడ్డే వీరేష్, వార్డ్ నాయకులు బీమేష్, టి కే బసన్న, రామదాసు, రవి, నజీర్, బసీర్, రమేష్, రాష్ట్ర కుర్ణి కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారద, రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్, జిల్లా వక్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, మున్సిపల్ కోఆప్షన్ మెంబెర్ అబ్రార్, కౌన్సిలర్లు నీలకంఠ, సుధాకర్,వాహిద్,ఇషాక్,రాజరత్నం ఇన్చార్జులు కోటకొండ నరసింహులు, విశ్వనాథ రమేష్, వినయ్, ప్రతాపరెడ్డి,గట్టు రఫీ,నాయకులు షేక్ చాందు,సలీం,రజాక్, ప్రభాకర్, గోకారి,యూసుఫ్, శ్రీరాములు,నాగేంద్ర, సోమిరెడ్డి,మంజునాథ్, బుట్టా యూత్ నాయకులు ఫయాజ్, ఉబేద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author