PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనసేన పై వైసీపీ స్కెచ్

1 min read

పల్లెవెలుగువెబ్ : జనసేన నేతలు వైసీపీ మంత్రులపై దాడిచేసేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ విషయంపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదంతా వైసీపీ నేతల స్కెచ్ అంటూ మండిపడ్డారు. జనసేనను తొక్కేసేందుకే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని.. జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా నాగబాబు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. వైసీపీ నాయకుల మీద దాడిచేయటం.. ఇంటెలిజెన్సు హెచ్చరిక అంటూ ప్రభుత్వం హడావిడి చేస్తోందని.. సీక్రెట్ గా పంపిన సర్కులర్ మీడియా కి ఎలా అందింది..? అంటే ఇప్పుడు జనసేన మీద మరో సారి ఎటాక్ చెయ్యటానికి రంగం సిద్ధం అయ్యిందా..? జనసైనికులు జాగ్రత్త.. వైజాగ్ ఇన్సిడెంట్స్ లాంటివి చాలా ఉంటాయని.. ట్వీట్ చేశారు.

About Author