PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి సోషల్ మీడియా విభాగం కమిటీ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసిపి సోషల్ మీడియా విభాగం కమిటీ కన్వీనర్ కో కోకన్వీనర్ లను ఎంపిక చేసినట్లు కో కన్వీనర్ హరినారాయణ శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోషల్ మీడియా విభాగం లో నియోజకవర్గ స్థాయి కన్వినర్, కో -కన్వినర్ లను నియమించడం జరిందన్నారు. ఇందులో భాగంగా ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డిని ఆయన స్వగృహంలో కలసి సోషల్ మీడియా బృందం శాలువాతో సత్కరించి బొకే ఇచ్చి ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి సోషల్ మీడియా ఉద్దెశించి జగనన్న ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలల్లోకి చేరావేయాలని సూచించారని సోషల్ మీడియా సభ్యులు మరింత ఉత్సహంగా పని చేయాలనీ వారికీ ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో కన్వినర్ హనీఫ్ కో కన్వినర్ లు నాగార్జున రెడ్డి, ధనుంజయ రెడ్డి దస్తగిరి యాదవ్ సిరివెళ్ల మండలం కన్వీనర్ చీమల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author