NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ  ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా..

1 min read

వైకాపా కార్యకర్తకు పరామర్శ..

అండగా ఉంటానని హామీ ఇచ్చిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అధైర్యపడొద్దు మీకు ఎల్లప్పుడూ నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అనారోగ్యంతో బాధపడుతున్న వైకాపా సీనియర్ నాయకులు దేవదాసుకుధైర్యాన్నిచ్చారు. నందికొట్కూరు పట్టణంలోని ఏ.బి.యం పాలెం నందు  విలేకరి కాటెపోగు స్వామన్న తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్   స్వగృహానికి రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మున్సిపల్ చైర్మన్  దాసి సుధాకర్ రెడ్డిలు వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి దేవదాసు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎవ్వరు భయపడవద్దని ఏదైనా అవసరం అయితే సమస్య తమ దృష్టి కి తీసుకురావాలని అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. వీరితో పాటు నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు బొల్లెద్దుల రామక్రిష్ణ, కౌన్సిలర్ చిన్న రాజు,  అబ్దుల్ రవూఫ్, లాలు ప్రసాద్,  వైసిపి నాయకులు రజిని కుమార్, పి రమేష్, పాల్గొన్నారు.

About Author