PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిలో చేరిన వైసీపీ వార్డు ఇంచార్జి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలోని 3వ వార్డు వైసీపీ ఇంచార్జి కురువ‌ చిన్న భీమ‌న్న తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మౌర్య ఇన్‌లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో ఆయ‌న టిడిపిలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తోపాటు ఆయ‌న బృందానికి టి.జి భ‌ర‌త్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు తాము కృషి చేస్తామ‌ని పార్టీలో చేరిన నేత‌లు చెప్పారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ క‌ర్నూల్లోని ప్రతి వార్డులో టిడిపికి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌న్నారు. ఇప్పటికే ప్రజ‌లంతా త‌మ‌వైపు ఉన్నార‌ని, ఇప్పుడు కీల‌క నాయ‌కులు సైతం త‌మ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమ‌వుతుంద‌ని అర్థంచేసుకుంటున్నట్లు చెప్పారు. తాను గెలిచాక క‌ర్నూలులో ఉన్న స‌మ‌స్యల‌న్నీ ప‌రిష్కరించి ప్రజ‌లంద‌రికీ మేలు చేసేవిధంగా పాల‌న సాగిస్తాన‌ని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధిలో ముందంజ‌లో ఉంటుంద‌న్నారు. పార్టీలో చేరిన వారిలో వినీత్ కుమార్, మ‌హేష్‌, ప‌ర‌మేష్‌, దివాక‌ర్, త‌దిత‌రులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి వార్డు ఇంచార్జి నాగ వీరాంజ‌నేయులు, రాజేశ్వరి శేషగిరి శెట్టి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author