PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కార్యకర్తలు..టిడిపిలోకి వలస..

1 min read

-త్వరలోనే ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం: మాండ్ర

పల్లెవెలుగు  వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి చెందిన వైసీపీ కార్యకర్తలు టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మిడుతూరు గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.గురువారం మధ్యాహ్నం నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి స్వగృహం అల్లూరులో వారు టిడిపి కండువాళ్ళు క ప్పుకున్నారు.టిడిపి పార్టీలో చేరిన గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు బీసన్న,నల్లబోతుల వెంకట్లు,కేశాలు,సురేష్,శ్రీకాంత్,శ్రీరాములు, మధు,శివ,జాను,మద్దిలేటి, మహేంద్ర,హరికృష్ణ,సంజన్న తదితరులకు మాండ్ర శివానందరెడ్డి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయని పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టిడిపి ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్ని కార్పొరేషన్లు గతంలో ఉండేవని ఈ ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్ రుణాలు నిర్వీర్యం చేశారని మీరందరూ వీటిని గమనించాలని త్వరలోనే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాండ్ర శివానందరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి,టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య,సుభాన్,బాబు సాహెబ్,ఐటిడిపి మండల కన్వీనర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author