PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీజీ భరత్​ సమక్షంలో… టీడీపీలో చేరిన  వైసీపీ యువత

1 min read

యువత భవిష్యత్తుకు నాది గ్యారెంటీ.. : టి.జి భరత్

పల్లెవెలుగు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి యువకులు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని మౌర్య ఇన్ లో ఉన్న టిజి భరత్ కార్యాలయంలో 12  వ వార్డు ఇంచార్జి చిన్నమ్మి ఆధ్వర్యంలో పండు యూత్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరికి టిజి భరత్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా టిజి భరత్ మాట్లాడుతూ యువ నాయకుడు పండు వర్గం వాస్తవాలు తెలుసుకొని మళ్లీ టిడిపిలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సేవ కోసమే తమ కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు రూపురేఖలు మారుస్తానని చెప్పారు. స్థానికంగా మంచి కంపెనీలు ఉంటే ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ఎంతో బాగుపడుతుందని.. తనకు ఒక్క అవకాశం ఇస్తే కర్నూలు యువత భవిష్యత్తు మారుస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. యువకులంతా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. కర్నూలు నుండి ఎంతో మంది యువతీ, యువకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని.. తనని గెలిపిస్తే కర్నూలుకు కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. అందరినీ గెలిపించినట్టే తనను కూడా ఒకసారి గెలిపిస్తే ఐదేళ్లు ఎలా పాలిస్తానో ప్రజలకే అర్థమవుతుందన్నారు. తమ టిజివి సంస్థల తరుపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని.. అధికారంలో ఉంటే అంతకుమించి ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని భరత్ అన్నారు. ప్రజలు మాయమాటలు నమ్మొద్దని వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అభిలాష్, నాగార్జున, రాజశేఖర్, ఆండ్రూస్, సుధాకర్,బాలు, భాస్కర్, మనోహర్, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు.

About Author