PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి గెలుపు అభివృద్ధికి మలుపు.. కాటసాని శివ నరసింహారెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల :  రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే  జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని శుక్రవారం నాడు గడివేముల టౌన్ లో పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివ నరసింహారెడ్డి డోర్ టు డోర్ ప్రజలకు కోరారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ మరొక్కసారి తన తండ్రికి ఓటు వేసి పాణ్యం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు వైసిపి హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందజేసినట్టు రాజన్న రాజ్యం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు ప్రజలందరూ సంతృప్తితో ఉన్నారని ఈసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారాల భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరిస్తుంటే ప్రభుత్వం అందజేసిన పథకాలపై సంతృప్తి చెందినట్టు ఈసారి కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వస్తామని ప్రజలు హామీ ఇవ్వడం మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావడానికి సంకేతంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. స్థానిక యువ నాయకుడు ఇచ్చిరెడ్డి ప్రతాప్ . మండల వైసిపి అధ్యక్షుడు శివరాంరెడ్డి . ఆనంద్ రెడ్డి .మేఘుడు .అనిల్ కుమార్ రెడ్డి. ఎల్లారెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. బాల చేన్ని . మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author