NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగా మన వారసత్వ సంపద…

1 min read

విద్యార్థులు విద్యతో పాటు యోగాభ్యాసం చేయాలి 

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్

కర్నూలు, న్యూస్​ నేడు : వేల సంవత్సరాల నుండి వస్తున్న యోగా మన వారసత్వ సంపద అని చదువుతోపాటు ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు.మంగళవారం ఉదయం కర్నూలు నగరంలోని  ఔట్ డోర్ స్టేడియంలో మున్సిపల్ కార్పొరేషన్  ఆధ్వర్యంలో  పారిశుధ్య కార్మికులు, ఎన్.సి.సి విద్యార్థులు, మహిళలు, అధికారుల భాగస్వామ్యంతో 5 వేల మందితో నిర్వహించిన థీమాటిక్ యోగా ప్రదర్శన  నిర్వహించారు. యోగా శిక్షకులు మునిస్వామి యోగా ప్రోటోకాల్ ప్రకారం   యోగాసనాలు వేయించారు. యోగా కార్యక్రమం నిర్వహణ తరువాత మంత్రి టి.జి.భరత్ మాట్లాడుతూ  యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు  దాదాపు 11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని, కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని అభినందించారు. యోగా ఐదు వేల సంవత్సరాల నుండి మనకు వారసత్వంగా వస్తోందని, యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు యోగా చేయడం అలవర్చుకోవాలని తెలిపారు. ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించి, ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో  మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  చర్యలు తీసుకున్నారన్నారు. ఈనెల 21వ తేదీన  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి విశాఖపట్నం సముద్రతీరంలో ఐదు లక్షల మందితో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఈ యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేలాగా ఉంటుందని మంత్రి తెలిపారు.కర్నూలు ఔట్ డోర్ స్టేడియం అభివృద్ధికి, అవసరమైన చర్యలు  చేపడుతున్నామని, అందులో భాగంగా వాకింగ్ ట్రాక్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రీన్ కో ద్వారా  సీ.ఎస్ఆర్ నిధులు రూ.4 కోట్లతో టిడ్కో గృహ సముదాయాల దగ్గర అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియంను నిర్మించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ    అభివృద్ధి కార్యక్రమాల  నిర్వహణలో కర్నూలు జిల్లా అగ్రగామిగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  స్వచ్ఛ ఆంధ్ర , స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలను చేపట్టారని, అవి విజయవంతం అయ్యాయని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక నెల రోజుల పాటు” యోగాంధ్ర” కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరిస్తున్నారని తెలియజేశారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని,  అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా సహకరించాలని కోరారు.జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో  10 లక్షల 96 వేల మంది కర్నూలు జిల్లా నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని , ఇది రాష్ట్రంలోనే అత్యధిక నమోదు అని తెలిపారు.  కర్నూలు జిల్లా వాసులు ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి విజయవంతం చేయాలన్న తపన తో సహకరిస్తున్నారని, ఇందువల్ల ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మొదటి ఐదు స్థానాల్లో  ఉంటోందని తెలిపారు.ఈనెల 21వ తేదీ న   విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారని,  5 లక్షల మందితో ఈ  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలో జూన్ 21 న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్  విజ్ఞప్తి చేశారు.   మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ   2 లక్షల 40 వేల సింహ భాగం రిజిస్ట్రేషన్లు కర్నూలు మున్సిపల్ శాఖ ద్వారా నమోదు కావడం గర్వంగా ఉందని తెలిపారు. పారిశుధ్య  కార్మికుల చే యోగా నిర్వహణ  అందరి సహకారంతో విజయవంతం చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, సీఈవో సెట్కూర్ వేణుగోపాల్,  జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి ,  ఎన్ సి సి కల్నల్ ప్రసాద్, డిస్ డి ఓ భూపతి రావు, కార్పొరేటర్ పరమేష్, ఆయుష్ డాక్టర్ ప్రసాద్ , మునిస్వామి , జిల్లా యోగా  సంఘం కార్యదర్శి అవినాష్,  జిల్లా అధికారులు మున్సిపల్ శాఖ సిబ్బంది మెప్మా సిబ్బంది ఎన్సిసి విద్యార్థులు, సాధారణ ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *