సర్ఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణ
1 min read
యోగ డే” లో సుమారు 450 మంది పాల్గొన్నారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సెర్ప్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్ మహిళలచే ఏలూరు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ లలో ఏలూరు, జంగారెడ్డిగూడెం మరియు నూజివీడు నందు “యోగాడే”నిర్వహించడమైనది.ఈ కార్యక్రమమునకు జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఆధ్వర్యంలో సెర్ప్ సంస్థ ద్వారా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమమునకు సెర్ప్ సిబ్బంది పిఎంలు,డిపిఎంలు, ఏపీఎంలు,సీసీలు,వివోఏలు మరియు సీనియర్ సిటిజన్ మహిళా సభ్యులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమమునకు సుమారుగా 450 మంది పాల్గొని యోగాంధ్ర నిర్వహించడం జరిగినదని పథకల సంచాలకులు డిఆర్ డిఏ-సర్ఫ్ ఏలూరు జిల్లా వారు ఒక ప్రకటనలో తెలిపారు.
