NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`మీకు లక్షల్లో జీతాలు.. మీ పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు`

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ ఉపాధ్యాయుల పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులు చదువు చెప్పే బడులలో వారి పిల్లల్ని ఎందుకు చదివించరని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏదైన సమస్య ఉంటే చర్చల ద్వార పరిష్కరించుకోవాలని, రోడ్లెక్కి నిరసన తెలపడం తగదని అన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఉద్యోగులు సహకరించాలని అన్నారు. సీఎం జగన్ పై ఉపాధ్యాయులు వాడిన భాష సరైంది కాదని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని అన్నారు.

    

About Author