PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కన్నడ సాహిత్య సమ్మేళనంలో యువ కవి దుంపాల వీరేష కు ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ అనంతపురం:  సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం లో కన్నడ సాహిత్య పరిషత్ నిర్వహించిన  8 వ కన్నడ సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో పెద్దకడబూరు మండలంలోని నాగలాపురం గ్రామ వాసి యువ కవి దుంపాల వీరేష గారు సన్మానంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు.హిందూపురం లో సత్కారం అందుకున్న దుంపాల వీరేష  మాట్లాడుతూ కె.హెచ్ ప్యాలెస్ వేదికగా   కన్నడ సాహిత్య పరిషత్ నిర్వహించిన కన్నడ సాహిత్య  సమ్మేళనం లో “వలసలు” అనే  అంశం పైన కవితను అందజేశానని తెలిపారు. ఈ కవితను కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షులు అంజన్ కుమార్  గుర్తించి వారి ఆధ్వర్యంలో సన్మానంతో పాటు జ్ఞాపికను వారు అందజేశారని తెలిపారు.హిందూపురం లో  సన్మానంతో పాటు జ్ఞాపికను అందుకున్న దుంపాల వీరేష  మాట్లాడుతూ ముందు ముందు ఇంకా మంచి కవితలు రాస్తానని తెలియచేశారు. సత్కారం అందుకున్న దుంపాల వీరేష ను యస్.యం.కె.వి ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ఉపాద్యాయ, ఉపాద్యాయిని సిబ్బంది మరియు వారి గురువులు సక్కిరి భాస్కర్, సాదుల సత్యనారాయణ మరియు విద్యార్థిని,విద్యార్థులు,నాగలాపురం గ్రామ సర్పంచ్ హనుమంత రెడ్డి  మిత్రులు శ్రేయోభిలాషులు గ్రామస్తులు అభినందించారు.

About Author