NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామానికి పేరు తెచ్చిన యువ కవి దుంపాల వీరేష

1 min read

పల్లెవెలుగు వెబ్ సత్యాసాయి జిల్లా:  సత్యసాయి జిల్లా, మడకశిర లో పెద్దకడబూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన యువ కవి దుంపాల వీరేష కు సత్యసాయి జిల్లా రచయిత ల  సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన మహనీయుల స్మారక సాహితీ పురస్కారాలు ప్రదానోత్సవంలో స్వతంత్ర సమర యోధులు మిళవాయి గోవింద రాజుల రెడ్డి, ముస్లిం నగార జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫరుక్ చేతుల మీదుగా యువ కవి దుంపాల వీరేష కు అంబేద్కర్ స్మారక పురస్కారం అందజేసి సత్కరించడం జరిగింది.పురస్కార గ్రహిత దుంపాల వీరేష  మాట్లాడుతూ ఈ పురస్కారం రావడం తనకు సంతోషంగా ఉందని తెలియజేశారు. కవి దుంపాల వీరేష ను యస్.యం.కె.వి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం , తోటి ఉపాధ్యాయ,ఉపాధ్యాయిని సిబ్బంది మరియు వారి గురువులు సక్కిరి భాస్కర్,సాదుల సత్యనారాయణ,వారి బంధువులు,స్నేహితులు, నాగలాపురం గ్రామ సర్పంచ్ హనుమంత రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు.

About Author