PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యంగ్‌ టైగర్‌‌ దూకుడు..

1 min read

సినిమా డెస్క్​ : యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టుల గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. అన్నీ బిగ్‌ ప్రాజెక్ట్స్‌ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేస్తున్న‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ​ త్వరలో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దసరా కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తరువాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల్లో ప్రశాంత్ నీల్ సినిమా మాత్రమే పాన్ ఇండియా సినిమా అని అనుకున్నారు. కానీ కొరటాల సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అని చెప్పుకుంటున్నారు. కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అనే విషయం తెలిసిందే. హీరోయిన్‌ కియారా అద్వాని పేరు వినిపిస్తోంది గానీ, క్లారిటీ రావలసి ఉంది.

About Author