PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరెంట్ షాక్ తో యువకుడు మృతి.. కేసు నమోదు..

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పొలంలో తాటి ముంజలు తెంపడానికి వెళ్లి విద్యుత్ వైర్ షాక్ వల్ల యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం ఆలమూరు గ్రామంలో చోటుచేసుకుంది ఆలమూరు గ్రామ పొలాలలో కోటపాడు లక్ష్మయ్య, వయస్సు 23 సంవత్సరములు తన పొలము లో ఉన్న తాటి చెట్టు ఎక్కి తాటి ముంజలు తెంపుతుండగా చెట్టు కొమ్మలు అక్కడే ఉన్న ఎలక్ట్రికల్ వైర్ కు తగులుకుని సంఘటన స్థలంలోనే మృతి చెందాడు కుడి కాలికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి కాలిన గాయము అయిందని అనంతరము మృతుడు చెట్టు పైనుండి కిందపడి చనిపోయినట్టు మృతుని తండ్రి వెంకట రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్టు ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపారు.

About Author