PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువత, సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి

1 min read

– మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యువత, సాంకేతికతను సద్వినియొగం చేసుకొని గెలుపు కోసం కృషి చెయ్యాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని ఎం.ఎం.గార్డెన్ నందు నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ స్థాయి తెలుగు దేశం పార్టీ రియల్ టైం స్టటజి ( ఆర్.టి.ఎస్) శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మరియు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అదే విధంగా సైకో జగన్ ప్రభుత్వం చేపడుతున్న నిరంకుశ, నియంత పాలన పట్ల పడుతున్న ఇబ్బందులను వారికి క్షేత్ర స్థాయి లో వివరించాలని పిలుపునిచ్చారు. యువతను, సాంకేతికతను సద్వినియొగం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారు.గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ… ఇదేం ఖర్మ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని కలుసుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులను కోరారు. వారు పడుతున్న ఇబ్బందులను నమోదు చేసుకోవడంతో పాటు గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధిని వివరించాలని కోరారు, ఓటర్ వెరిఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, రానున్న ఎన్నికల్లో శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గెలుపుకు కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో బన్నురు రామ లింగారెడ్డి, అహమ్మద్ హుస్సేన్, వంగాల శివ రామిరెడ్డి, కలిముల్లా, మౌలీశ్వర్ రెడ్డి, బోర్వెల్ రజాక్, వేణు గోపాల్, శ్రీనివాస రెడ్డి, షాబుద్దీన్ న్లిలుల్లా, మల్లేశ్వర రెడ్డి, ఉల్లి మధు, శ్రీనివాస రెడ్డి, రాజా రెడ్డి, రమణ, శిక్షకులు పరమేశ్వర రెడ్డి, ముస్తఫా, అబ్దుల్లాపురం బాషా, రాముర్తి, నాఘుర్, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author