NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి గెలుపు కోసం యువత కష్టపడాలి…టిడిపి ఇంచార్జి టి.జి భరత్

1 min read

టి.జి భరత్ సమక్షంలో వైసీపీని వీడి టిడిపిలో చేరిన యువకులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం యువతరం కష్టపడాల్సిన అవసరం ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్లోని ఆయన కార్యాలయంలో జొహరాపురం తెలుగుగేరి యువకులు కుమార్, ధను, తేజ, వంశీ, కిషోర్ లతో పాటు భారీగా యువత వైసీపీని వీడి.. హిందూ ధర్మ రక్షకుల బృందం నాయకుడు శివ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భరత్ యువకులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు. కర్నూల్లో తాను గెలిచిన తర్వాత నగరం రూపురేఖలు మారుస్తానని భరత్ తెలిపారు. సమాజానికి మంచి చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని తాను ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. తాను గెలిచిన తర్వాత ఐదేళ్లు మంచి పాలన అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ రక్షకుల బృందం యువకులు పాల్గొన్నారు.

About Author