PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో వైఎస్ భార‌తీ పాత్ర : ఆనం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌గ‌న్ ప్రభుత్వంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్ స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. ఆదాన్ అనే డిస్టిలరీ స్థాపించి ఎంపీ విజయసాయిరెడ్డి స్కామ్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్‌ పునాదులు కదులుతున్నాయని తెలిపారు. జగతి పబ్లికేషన్స్‌కు, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపించారు. క్విడ్‌ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కు ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కోట్లు మళ్లించిందన్నారు. విజయసాయిరెడ్డితో ఆర్థిక సంబంధాలున్న పనాక శరత్‌రెడ్డిని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారిస్తోందని తెలిపారు. తన లావాదేవీల కోసమే జగన్ దావోస్‌ వెళ్లారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో వైఎస్ భారతి , విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

                                         

About Author