NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ సారధి.. వైఎస్​ జగన్​కు జన్మదిన వేడుకలు

1 min read

భారీ కేక్​ కట్​చేసిన ఎస్వీ దంపతులు

పల్లెవెలుగు: ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సారధి బడుగు జీవుల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కర్నూల్ సెక్యులర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి  మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షురాలు ఎస్ వి విజయ మనోహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా 33 వార్డ్ లకు చెందిన వైస్సార్సీపీ కార్యకర్తలు ఎస్ వి అభిమానులు భారీ గా తరలివచ్చి స్థానిక రాజవిహార్ సెంటర్ నుండి ర్యాలీ గా కొండా రెడ్డి బురుజు వరకు వెళ్లారు. కార్యకర్తల కేరింతల తో నగరంలో మునిపెన్నడు జరగని రీతిలో పుట్టినరోజు ర్యాలీ జరిగింది. కొండ రెడ్డి బురుజు సెంటర్ లో జగన్నన్న భారీ కటౌట్ కు  ఎస్ వి దంపతులు పాలాభిషేకం, పుష్పాభిషేకంగా వించారు. పిమ్మట కార్యకర్తల హర్షద్వనాల మధ్య భారీ కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్ నగరం పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పేద వాడి గుండె చప్పుడు అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024లో జగనన్న న్న ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. సంక్షేమానికి పెద్ద పీట వేసి  అణగబడిన వర్గాల వారికి అండగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో  కార్యకర్తలు జై జగన్ జై ఎస్.వి నినాదాలతో కొండారెడ్డి బురుజు ప్రాంగణం దద్దరిల్లిపోయింది కార్యక్రమంలో 33 వార్డులకు చెందిన నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మాజీ డైరెక్టర్లు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్లు వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాళ్లు ఎస్వీ యూత్ పాల్గొన్నారు.

About Author