PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూలై 8న వైఎస్ జ‌యంతి.. ష‌ర్మిల పార్టీ ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల పార్టీ పేరు దాదాపు ఖ‌రారైపోయింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా రాజ‌కీయ‌పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ జ‌యంతి జులై 8.. ఆ రోజే పార్టీ ప్రారంభోత్సవం జ‌ర‌గ‌నుంది. వైఎస్ఆర్టీపీ పార్టీ ఏర్పాటు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని ఇప్పటికే.. వైసీపీ గౌర‌వ అధ్యక్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ నో అబ్జక్షన్ లెట‌ర్ ఇచ్చారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద పార్టీ రిజిస్ట్రేష‌న్ కు సంబంధించిన అన్ని ప‌నులు పూర్తీ అయిన‌ట్టు ఆ పార్టీ స‌మ‌న్వయ‌కర్త వాడుక రాజ‌గోపాల్ తెలిపారు. ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి అభ్యంత‌రాలు రాలేద‌ని తెలిపారు. పార్టీ ప్రక‌ట‌న అనంత‌రం సంస్థాగ‌త నిర్మాణం మీద దృష్టి పెట్టనున్నార‌ని స‌మాచారం. జిల్లాల నుంచి గ్రామాల వ‌రకు పార్టీ సంస్థాగ‌త బ‌లోపేతం కోసం కృషి చేయ‌నున్నార‌ని స‌మాచారం.

About Author