PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీఎస్పీఎస్సీ కార్యాల‌యం ముందు వైఎస్ ష‌ర్మిల ఆందోళ‌న

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణలో నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు మెరుపు దీక్షకు దిగారు. సాయంత్రం వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే షర్మిలను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు దాటుతున్నా.. ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

                                

About Author