PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్​ షర్మిల పర్యటన..విజయవంతం

1 min read

కాంగ్రెస్​ అభిమానులకు కృతజ్ఞతలు

  • కాంగ్రెస్​ నాయకులు, శ్రీ గాయత్రి హాస్పిటల్​ ఎం.డి. షేక్​ జిలాని బాష

కర్నూలు, పల్లెవెలుగు:ఆంధ్ర ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పర్యటన విజయవంతమైందని, ఇందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు కాంగ్రెస్​ నాయకులు, శ్రీ గాయత్రి హాస్పిటల్​ ఎం.డి. షేక్​ జిలాని బాష.  మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారి కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా  వైఎస్​ షర్మిలకు కర్నూలు జిల్లా ప్రజలు, కాంగ్రెస్​ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పట్టారన్నారు. వైఎస్​ షర్మిల సమక్షంలో రెండువేల మందితో కలిసి కాంగ్రెస్​ పార్టీలో చేరానని,  కర్నూలు డీసీసీ అధ్యక్షుడు బాబురావు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మినరసింహ నేతృత్వంలో పని చేస్తానని ఈ సందర్భంగా జిలాని బాష పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ సముద్రం లాంటిదని, అందరినీ కలుపుకొని వెళ్తుందన్న ఆయన… పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్​ నాయకులు, శ్రీ గాయత్రి హాస్పిటల్​ ఎం.డి. షేక్​ జిలాని బాష  ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను కోరారు.

About Author