PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేకా కుమార్తె సంచ‌ల‌న వ్యాఖ్యలు

1 min read

ఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి రెండేళ్లు పూర్తీ కావస్తున్నా.. ఒక్క నిందితుడిని ప‌ట్టుకోలేద‌ని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి త‌మ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయి కేసులో ఇలా జ‌రిగితే.. సామాన్యుడికేం న్యాయం జ‌రుగుతుంద‌ని విమ‌ర్శించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో కీల‌కంగా పేర్కొంటున్న శ్రీనివాస‌రెడ్డి ఆత్మహ‌త్య విష‌యంలో త‌న‌కు అనుమానం ఉంద‌ని ఆమె అన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహ‌త్య చేసుకుంటే.. కిడ్నీ, లివ‌ర్ మ‌ధ్యలో ర‌క్తస్రావం జ‌రిగిన‌ట్టు పోస్టుమార్టమ్ రిపోర్టులో ఎలా వ‌చ్చిందంటూ ప్రశ్నించారు. హ‌త్య కేసులో విచార‌ణ ఆల‌స్యమ‌య్యే కొద్దీ.. మ‌రింత మంది సాక్షుల‌కు ప్రమాదం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆమె అన్నారు. త‌న తండ్రి హ‌త్య కేసులో న్యాయం జ‌రిగేందుకు త‌న‌కు ప్రతి ఒక్కరూ స‌హ‌క‌రిం చాల‌ని కోరారు.

About Author