PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేకా హ‌త్య కేసు..స‌మాచారం ఇస్తే కోటి రివార్డ్ ఇవ్వండి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో స‌మాచారం అందించే వారికి త‌ప్పకుండా ప్రాణ‌భ‌యం ఉంటుందని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు అన్నారు. సీబీఐ ప్రక‌టించిన 5 ల‌క్షల రివార్డు ఏ మూల‌కు స‌రిపోతుంద‌ని ప్రశ్నించారు. హ‌త్య కేసులో స‌మాచారం అందించే వారికి కోటి రివార్డు ఇవ్వాల‌ని సూచించారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు స‌త్వర విచార‌ణ‌లో భాగంగానే ఈ రివార్డు ప్రక‌టించి ఉంటార‌ని భావిస్తున్నట్టు ఆయ‌న చెప్పారు. ఈ కేసులో న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు. ఢిల్లీలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ర‌ఘురామ‌కృష్ణరాజు మాట్లాడారు. వైఎస్ వివేక హ‌త్య కేసులో న‌మ్మద‌గిన స‌మాచారం ఇస్తే ఐదు ల‌క్షల రివార్డు ఇస్తామ‌ని సీబీఐ ప్రక‌టించ‌డం తెలిసిందే.

About Author