PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేక హత్య కేసు.. వేరే రాష్ట్ర్రానికి బదిలీకి గ్రీన్ సిగ్నల్

1 min read

పల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం ఇస్తామని తెలిపింది. ఏపీలో ఈ కేసు విచారణ సరిగా జరగడం లేదని, సాక్షులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దర్యాప్తు అధికారులపై ప్రైవేట్ కేసులు పెడుతున్నారని… ఈ నేపథ్యంలో సీబీఐ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కూతురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దాదాపు మూడు గంటల పాటు విచారించింది.

About Author