PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు: వైఎస్ విజ‌య‌మ్మ లేఖ‌

1 min read

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు నిగ్గుతేల్చాల్సిందేన‌ని అన్నారు వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి, వైఎస్ విజ‌య‌మ్మ. ఈ మేర‌కు 5 పేజీల లేఖ విడుద‌ల చేశారు. వైఎస్ వివేకా హ‌త్య మీద త‌న మాట‌, జ‌గ‌న్ మాట‌, ష‌ర్మిల మాట ఒక‌టేన‌ని అన్నారు. ఇటీవ‌ల తిరుప‌తి ఉపఎన్నిక బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ వైఎస్ వివేకా హ‌త్య మీద స్పందించారు. వైఎస్ జ‌గ‌న్ మీద విమ‌ర్శలు గుప్పించారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ విజ‌య‌మ్మ ఈ లేఖ రాశారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ప‌రిధిలోని ద‌ర్యాప్తు సంస్థ అని తెలిసి కూడ .. ప‌వ‌న్ విమ‌ర్శిస్తున్నార‌ని ఆ లేఖ‌లో విజ‌య‌మ్మ పేర్కొన్నారు. ప‌వ‌న్ విమ‌ర్శలు అర్థర‌హిత‌మ‌ని అన్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు డాక్టర్ సునీత సీబీఐ అధికారుల‌ను క‌లిశారు. హ‌త్య జ‌రిగి రెండేళ్లయిన‌.. కేసులో ఎలాంటి పురోగ‌తి లేద‌ని మీడియా ముందు వాపోయారు. దీంతో రాజ‌కీయంగా జ‌గ‌న్ మీద విమ‌ర్శల దాడి తీవ్రమైంది. ఈ నేప‌థ్యంలో వైఎస్ విజ‌య‌మ్మ స్పందించారు.

About Author